AP News: వైకాపా ప్రజాప్రతినిధి అబ్బాయి అక్రమాల దందా

కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం.. కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. జిల్లా కేంద్రానికి అతి సమీపంలో దారుణమైన దందా జరుగుతున్నా అధికారులు చేష్టలుడిగి చూస్తుండిపోయారంటే.. ఈ ప్రజాప్రతినిధి విధ్వంసకాండను అంచనావేయొచ్చు..

Updated : 26 Apr 2024 11:51 IST

ప్రకృతి అందాలు, సహజ వనరులకు నిలయమైన పశ్చిమదోదావరి జిల్లాలో ఆ అబ్బాయిగారి దోపీడీ పర్వం నిర్విరామంగా కొనసాగుతోంది. కొల్లేరు, పోలవరం కాలువ, తమ్మిలేరు.. ఏదైనా అడ్డంగా దోచుకోవడమే ఆయన పని. చేపల చెరువుల తవ్వకాలు, మట్టి మాఫియాలో అయితే మహా దిట్ట. పర్యావరణానికి హాని చేయడంలో పట్టా తీసుకున్నారేమో అన్నట్లుంటుంది ఆయన తీరు. పోలీసులైనా, అధికారులైనా.. ఆ ప్రజాప్రతినిధి మాట జవదాటరంతే. అబ్బాయి అక్రమాలకు వంతపాడేది, అసలీ దోపిడీ కథ నడిపేది ఆయన తండ్రే. ఏలూరు సమీప నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా సాగే వారి దందాలతో జనం విలవిల్లాడుతున్నారు.

Tags :

మరిన్ని